పాదాభివందనం ఎందుకు చేయాలి

పాదాభివందనం ఎందుకు చేయాలి. పాదాభివందనం వలన ప్రయోజనం ఏమిటి ?


పాదాభివందనం ఎందుకు చేయాలి




శ్లో𝕝𝕝 అవశ్యం భావినో భావాః భవన్తి మహతామపి।

నగ్నత్వం నీలకణ్ఠస్య మహాహిశయనం హరేః॥


తా𝕝𝕝 నిశ్చయముగా విధివలన సంభవించు సుఖదుఃఖాది వివిధ సందర్భములు మహాత్ములకు కూడా సంభవించుచునే ఉన్నవి..... 


ఎట్లనగా శివునికి దిగంబరత్వము, ఆ శ్రీమన్నారాయణునికి వేయిపడగలతో ఉన్న మహాసర్పముపై నిద్రించడం ఇలాంటివి... 

కావున సమస్యలు ఈ జీవనవిధానంలో ఒక భాగమే అని భావము....


పాదాభివందనం వలన    ప్రయోజనం ఏమిటి  ? 

పాదాభివందనం ఎందుకు చేయాలి ?




 

శుభకార్యాలలో పెద్దల, ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.


  కేవలం శుభకార్యాల లోనే కాక పెద్దవారు, కనిపించనప్పుడు, కూడా వారి పాదాలను, తాకుతారు చిన్నవారు.

అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి.


భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను, తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న, పురాతనపద్దతి. అయితే, కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తారు.


పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత, ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలున్నాయి.


పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచాలి. అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.


సాధారణంగా పెద్దవారి, పాదాలు తాకినప్పుడు, వారి,ఆలోచనలు, స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉంటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతాయి.


పెద్దవారి పాదాలను తాకడానికి నడుము వంచి కుడిచేతిని వారి, ఎడమ కాలిమీద పెట్టాలి. అలాగే ఎడమచేతిని వారి, కుడి కాలి మీద ఉంచాలి. అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. ఇలా, చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఆ సమయంలో వారి, శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవ్వుతాయి.

 ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే దీవెనలు ఫలిస్తాయి.

పెద్దవారు ఈ భూమి మీద, నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం, వల్ల వారి పాద ధూళిలో, కూడా, ఎంతో జ్ఞానం దాగి, ఉంటుంది. ‘మేము కూడా, మీ మార్గంలో నడిచి అనుభవాన్ని,జ్ఞానాన్ని, సంపాదించడానికి, ఆశీర్వదించండి అని, చెప్పే సంప్రదాయానికి, ప్రతీకగా వారి పాదాలను, తాకుతాము.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻


No comments

Powered by Blogger.